రుద్రంపూర్, ఏప్రిల్ 01 : గత నెల 26న కొత్తగూడెం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2026 – 27 ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ – 1 గా పోటి చేసి ఘన విజయం సాధించిన సీనియర్ మహిళ న్యాయవాది షేక్ షాజహాన్ పర్వీన్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గత 16 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్న షాజహాన్ పర్వీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు మొట్టమొదటి ఉపాధ్యక్షరాలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రధాన అధికారి పలివేల గణేష్ బాబు చేతుల మీదుగా ఆమె నియమకం పత్రం అందుకున్నారు. తనపై నమ్మకంతో ఓటువేసి గెలిపించిన అందరికీ పర్వీన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ అభ్యున్నతి కోసం, న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు.