భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 20 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహా సభకు ప్రజలు వేలాదిగా హాజరయ్యేలా కాపు సీతాలక్ష్మీ దంపతులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. రామవరంలో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానం పలుకుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల గల నిబద్ధతతో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రతి కుటుంబాన్ని కలిసి సభలో పాల్గొనాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసాగించారని అన్నారు.
ఈ దంపతుల సేవా దృక్పథం, పార్టీ పట్ల ఉన్న అంకితభావం ఇతరులకు ప్రేరణగా మారుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కాపు కృష్ణ, ఖాజా బక్ష్, షరీఫ్ మధు బాబు జాన్, ఈశ్వరి, సుమ, రమ్య కృష్ణ, తమ్మీశెట్టి నాగమని, పల్లవి, సుల్తానా, కతిజ, ఆషాపాసి, స్వాతి, నందిని, రాణి, వరలక్ష్మి, వాసుకి, మాలతీ, దేవి, శైలజ, అప్పు, నవత, సుమలత, తదితరులు పాల్గొన్నారు.