పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్గా సి.జంగయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ.రామారావు ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టిన కమాండెంట్కు వారు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కేటీపీఎస్ పరిరక్షణలో యూనియన్ సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఎల్లప్పుడు సంస్థ అభివృద్దే ప్రథమ లక్ష్యంగా తమ యూనియన్ పనిచేస్తుందని నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్.శ్రీనివాసాచారీ, బొల్లెపోగు రవి, టి.రాములు నాయక్, లక్ష్మయ్య, ఆర్వీ చారీ, వేణుగోపాల్లు పాల్గొన్నారు.