భద్రాచలం:ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, చేసే పనిని దైవంగా భావించినప్పుడే వృత్తి పట్ల అంకితభావం ఉంటుందని ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం నర్సింగ్ శిక్షణ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, ల్యాబ్, బాత్రూమ్లన్నీ అపరిశుభ్రంగా ఉండటంతో ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేస్తున్న ప్రదేశాలు, గదులు, వరండాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. శిక్షణ పొందుతున్న ఏఎన్ఎంలకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని అన్నారు.
అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థినీలను ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధీనీల సమస్యలు తెలుసుకుని ప్రతిపాదనలు సమర్పించాలని ఏడీఎంఅండ్హెచ్ఓకు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ దయానందస్వామి, డీఈ శ్రీనివాస్ హరీష్, ప్రిన్సిపాల్ అనురాథా దేవి, ట్రైనర్ ధర్మారావు, భీమేశ్వరరావు, వార్డెన్ సుశీల, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.