చండ్రుగొండ: ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటిడిఏ అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం మండలంలోని తిప్పనపల్లి, బాలికుంట గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థుల స్థాయి, తరగతికి తగ్గట్టుగా విద్యాభోధన ఉండాలన్నారు.
గణితం, ఇంగ్లీష్, తెలుగు తరగతులపై ప్రత్యేకంగా శ్రద్ద చూపాలన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఇస్లావత్ వీరన్న, వీరభద్రం, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.