రుద్రంపూర్, ఫిబ్రవరి 02 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెస్ట్ ఆఫీసర్గా ఎంపికైన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజును సింగరేణి కాలరీస్ ఎస్సీ–ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జీఎం కార్యాలయంలో శాలువా, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. శాలెం రాజు సమర్థ నాయకత్వం, కృషి, పట్టుదల వల్లే కొత్తగూడెం ఏరియా ప్రతి సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాలను మించి సాధిస్తూ సింగరేణి సంస్థలో ముందంజలో నిలుస్తోందన్నారు. ఈ అవార్డు ఏరియా కార్మికులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కపాటి వెంకటేశ్వరరావు, కలవల చంద్రశేఖర్, భూక్య రాందాస్, నాయుడుపెల్లి యోహన్, జి.లక్ష్మణ్, అనిల్ కుమార్, జిమ్మిని మల్లేష్, అజ్మీర శ్రీనివాస్, దౌర్య, పొన్నగంటి అంకుస్, చెరుపల్లి నాగరాజు, కె.మణి విక్టరీ, మొగిలిపాక రవి, మోహన్ పీవీకే పాల్గొన్నారు.