చండ్రుగొండ: గిరివికాస్ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మద్దుకూరు పంచాయతీలో గిరివికాస్ పథకం బోర్బావి తవ్వకం పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ప్రతి రైతును ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులకు గిరివికాసం పథకంఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతులకు రైతుబంధు పథకం వల్ల వ్యవసాయ పెట్టుబడులకు ఆర్దిక భరోసా ఇచ్చినట్లు అయిందన్నారు. 24గంటల పాటు ఉచిత కరెంటు పథకం వల్ల నీటిపై రైతుల ఖర్చు తగ్గటంతో పాటు, నాణ్యమైనా విద్యుత్ సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, గుంపెన సోసైటి వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, సర్పంచ్ పద్దం వినోద్ , ఎంపిటీసీ బొర్రా లలితకుమారి,టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ భోజ్యనాయక్, ఎంపిడిఓ అన్నపూర్ణ,ఎంపిఓ తోట తులసీరాం, జిపి సెక్రటరీ కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.