దమ్మపేట : మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన ఎంపీడీవో కార్యాలయం వద్ద సొసైటీ సభ్యులు, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వమే మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలను అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించిన చేపపిల్లలను ఆయా సొసైటీలు,మత్స్యకారులు చెరువుల్లో మత్స్యసంపదను పెంపొదించుకోవాలని కోరారు.
తద్వారా మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. మండలంలోని 34 చెరువులకు సంబంధించిన సొసైటీ సభ్యులకు 7.26లక్షల చేపపిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. వీటిలో బొచ్చ, బంగారుతీగ, రాహువు అనే రకాల చేపపిల్లలు ఉన్నట్లు తెలిపారు. వీటిని 100శాతం సబ్సిడీపై మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఎంపీడీవో నల్లబోతుల రవి, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్కె.బుడే, మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ జిన్నా, సొసైటీ సంఘం సభ్యులు గాజుబోయిన ఏసుబాబు, రాయల నాగేశ్వరరావు, కూరం అర్జునరావు, మత్స్యశాఖ అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్.కోటేశ్వరరావు, సిబ్బంది మంగరాజు, భార్గవ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.