పాల్వంచ: కొత్తగూడెం జిల్లాలో నేరాలను అదుపులో ఉంచుతూ శాంతి భద్రతలు కాపాడటంలో జిల్లా పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని హెచ్ఆర్పీవీఏ జిల్లా అధ్యక్షుడు కారెం జాన్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల పరిరక్షణ స్వచ్చంద సంస్థ సభ్యులు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో జిల్లా పోలీసులు నిద్రాహారాలు లేకుండా ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని, మానవ హక్కులను కాపాడటంలోను ముఖ్యపాత్ర పోలీసులదేనని ప్రసంశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, రవీంద్రాచారీ, అశోక్కుమార్, సత్యనారాయణలు పాల్గొన్నారు.