దుమ్ముగూడెం: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాలతో ఆహ్లాదం మరింతగా పెరుగుతుందని ఎంపీడీవో చంద్రమౌళి అన్నారు. ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెంలో ఈ బృహత్ పల్లెప్రకృతి వనాన్ని రూ.26లక్షలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇప్పటికే వనంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ బృహత్ పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు విద్యుత్ కనెక్షన్తో పాటు మోటారు సైతం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే గ్రామపంచాయతీల్లో పల్లెప్రకృతి వనాలు పచ్చగా ఆహ్లాదకరంగా మారాయని, బృహత్ పల్లెప్రకృతివనంలో వేలాదిగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలా కృషి చేస్తామన్నారు.
ఈ వనంలో ఉదయం, సాయంత్రం ప్రజలు సేదతీరేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ముత్యాలరావు, ఈజీఎస్ ఏపీవో సుకన్య, సర్పంచ్, ఈజీఎస్ సిబ్బంది, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.