టేకులపల్లి, జూలై 01 : బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) పార్టీకి సైనికుల్లా పనిచేస్తూ, బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఎల్ఏ చురుగ్గా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా కృషి చేయాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న హరిప్రియ నాయక్, ప్రతి బూత్లో పార్టీ బలాన్ని పెంచే దిశగా క్రమశిక్షణతో, అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్