భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారు రోజుకో రూపంలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులను కటాక్షించనున్నారు.
అలాగే రేపు అంటే బుధవారం నాడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13న ఉత్తర ద్వార దర్శనం జరగనుంది. అదే రోజున నిత్యకల్యాణాలను మాత్రం ఆలయ కమిటీ రద్దు చేసింది.
తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి కూడా భక్తులు రాకుండా నిషేధం విధించారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అనుమతిని నిరాకరించినట్లు అధికారులు వివరించారు.