మణుగూరు టౌన్, డిసెంబర్ 16: ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టిందని అన్నారు. దేశ ప్రజల మన్ననలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ రేగా, ఆయన మిత్రబృందం వెంట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. అలాగే ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను, ఎంపీ జోగినపల్లి సంతోశ్ను బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.