టేకులపల్లి అక్టోబర్ 12: ఈ నెల 14న బీసీల రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల బీసీ సంఘాల నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు.టేకులపల్లి మండల కేంద్రంలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, బంద్ పిలుపుకు మద్దతు తెలపాలని నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చొరవ చూపాలని కోరారు.
బంద్ రోజున వ్యాపార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా మూసివేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ బంద్ విజయవంతం చేయాలని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. టేకులపల్లి మండల బీసీ కుల సంఘాల నేతలు నర్సింగ్ లక్ష్మయ్య, మావునూరి రమేష్, తౌడోజు బిక్షమయ్య, గాడేపల్లి రాములు, చిర్రా వెంకటయ్య, డోర్నాల శ్రీను, లక్కినేని వెంకన్న, కట్టుకొజ్వల సురేష్, ఉరిమెళ్ళ యదాచారి, అనంతుల వెంకన్న, పి హరినాథ్ బాబు, లక్కినేని వెంకటేశ్వర్లు, కే వెంకటేశ్వర్లు, ఎన్ కోటయ్య పాల్గొన్నారు.