ములకలపల్లి :మండల పరిషత్ కార్యాలయంలో తడి, పొడిచెత్తపై గ్రీన్ అంబాసిడర్లు, మల్టీపర్సస్ వర్కర్లకు సోమవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన ఎంపీపీ మట్ల నాగమణి మాట్లాడుతూ గ్రామాల్లో తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసి పంచాయతీ వర్కర్లు వచ్చిన సమయంలో ట్రాక్టర్లు, రిక్షాల్లో వేసేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో లక్ష్మయ్య, ఐటీసీ అధికారులు, వాష్ ఇనిస్టిట్యూట్ పీవో గణేష్బాబు, సూపర్వైజర్ జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.