కొత్తగూడెం: ఏఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన రామవరం గోదుమవాగు బ్రిడ్జి వద్ద జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని శుభాష్ చంద్రబోస్ (ఎస్సీబీ)నగర్లో నివాసముంటున్న సీహెచ్. సురేష్ (57) పోలీస్ శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సురేష్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి డీసీఆర్బీ అటాచ్మెంట్ విధులు నిర్వర్తిస్తున్నారు. సురేష్ సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా రామవరం గోదుమవాగు బ్రిడ్జి వద్ద విజవాడ నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న టింబర్ లోడు లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సురేష్ ప్రాణాలను కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరస్థితులను పరిశీలించారు. సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలలోని మార్చూరికి తరలించారు. ఏఎస్సై సురేష్కు భార్య,ఇద్దరు కుమార్తెలు,కుమారుడు ఉన్నారు.