పాల్వంచ, జూన్ 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ ఐదో దశ కర్మాగారంలో శుక్రవారం హైడ్రోజన్ సిలిండర్ పేలి ఆర్టీజన్ ముద్దపోయిన సుబ్బారావు(46) మృతిచెందారు. పాల్వంచలోని ప్రశాంత్కాలనీలో నివసించే సుబ్బారావు కేటీపీఎస్ ఐదో దశ తొమ్మిదో యూనిట్లో ఆర్టీజన్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 9వ యూనిట్లో టర్బైన్ లొకేషన్లో సుబ్బారావు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు లాగానే టర్బైన్ వద్ద హైడ్రోజన్ సిలిండర్ క్యాప్ (మూత)ను బిగిస్తుండగా అది ఒక్కసారిగా ఊడి పేలిపోయి అత్యంత బలంగా సుబ్బారావుకు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అక్కడ ఉన్న ఇంజినీర్లు, అధికారులు వెంటనే కొత్తగూడెంలోని సింగరేణి దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్బారావు మృతి చెందారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కేటీపీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.