భద్రాచలం: భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నారు.భక్తులు ఆయా అవతారాల్లో దర్శనమిస్తున్న జగదభిరాముడ్ని చూసి తరిస్తున్నారు. అధ్యయనోత్సవాల్లో నాలుగో రోజులో భాగంగా గురువారం వైకుంఠ రాముడు నృసింహావతారంలో దర్శనమిచ్చారు.