‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్..’ అన్న నినాదాలతో ఖమ్మం జిల్లా మార్మోగింది. అయోధ్యలో సోమవారం భక్తిప్రపత్తులతో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కర్తగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని భక్తులు వీక్షించేందుకు పలు ఆలయాల్లో నిర్వాహకులు ప్రత్యేక ఎల్డీఈ తెరలను ఏర్పాటు చేశారు.
ఇక భక్తులు కూడా తమ ఇళ్లపై కాషాయ జెండాలను కట్టారు. అయోధ్య అక్షింతలను శిరస్సులపై చల్లుకున్నారు. మరికొన్ని ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం మహిళలు ఇళ్ల ముంగిట దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. – నమస్తే నెట్వర్క్