ఖమ్మం : ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో చట్టబద్ధత మైన దత్తతపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రైతువేదికలో పిల్లలు కలగని దంపతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మేడా ప్రసాద్ మాట్లాడుతూ దత్తత తీసుకునే విషయంలో ప్రతిఒక్కరూ చట్టబద్ధమైన దత్తతకు సిద్ధం కావాలని, పిల్లల రక్షణకు ఐసీడీఎస్ సహకారం ఉంటుందన్నారు.
అనంతరం డాక్టర్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి ద్వారా దత్తత తీసుకోవడంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మధిర నియోజకవర్గ ఐసీడీఎస్ సీడీపీవో శారదాశాంతి, ఐసీడీఎస్ ఏసీడీపీవో కృష్ణశ్రీ, చైల్డ్వెల్ఫేర్ కమిటీ సభ్యులు, సూపర్వైజర్లు వెంకటరమణ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.