కారేపల్లి, జూన్ 26 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఏడాది కాల పరిమితితో టెంట్ సామను అద్దెకు ఇవ్వడానికి, కొబ్బరి చిప్పల పోగుకు వేలం పాటను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పర్స పట్టాభి రామారావు, ఈవో కె.వెంకటయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1వ తేది నుండి 31జూన్ 2027 కాల పరిమితితో కోట మైసమ్మ తల్లి ఆలయ పరిసరాలలో టెంట్ సామనుల నిర్వహణ, కొబ్బరి చిప్పల పోగు చేసుకోవడానికి ఈ వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెంట్ హౌస్ నిర్వాహణ కోసం రూ.1 లక్ష, కొబ్బరి చిప్పల కోసం రూ.5 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. కొబ్బరి చిప్పల పోగుకు జాతర నిర్వాహక కాలంలో 20 రోజులు పాటు అవకాశం ఉండదని ఆ సమయంలో వేరే టెండర్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సమీప ప్రాంతవాసులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.