మామిళ్లగూడెం, జనవరి 31 : నగరంలోని రెండు లారీలు ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం ఏసీపీ హరికృష్ణ తెలిపారు. బుధవారం ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం పంపింగ్వెల్ రోడ్డుకు చెందిన తమ్మిశెట్టి చిరంజీవి, ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేట కాలనీకి చెందిన కొత్త ఎలీషా ఖమ్మం త్రీటౌన్ ఏరియాలోని రోడ్డు పకన పార్ చేసి ఉంచిన లారీలు, గత ఏడాది నవంబర్లో ఒక లారీ, ఈ ఏడాది జనవరిలో మరో లారీని దొంగిలించారని తెలిపారు.
వీరిపై నిఘా పెట్టిన ఖమ్మం సీసీఎస్ త్రీటౌన్ పోలీసులు నిందితులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్లో చోరీ చేసిన లారీని విడివిడి భాగాలుగా చేసి అమ్మి వేయడంతో దానిద్వారా వచ్చిన రూ.2 లక్షలను సైతం స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీసీఎస్ ఏసీపీ టి.రవి, సీసీఎస్ సీఐ బి.బాలాజీ, ఖమ్మం త్రీటౌన్ సీఐ బి.రమేశ్, సీసీఎస్ ఎస్ఐ జె. వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ శ్రీనివాస్ సుధాకర్ పాల్గొన్నారు.