ఖమ్మం : సమాజంలోని ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు యువతకు, మహిళలకు జిల్లా మహిళా ప్రాంగణంలో పలు రంగాల్లో వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నట్లు జిల్లా మహిళా ప్రాంగణాధికారిణి వేల్పుల విజేత తెలిపారు. కోవిడ్ కారణంగా నిలిపిన శిక్షణ తరగతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం తిరిగి ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలకు సేఫ్టీ అండ్ సెక్యురిటీ కోర్సులో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30వతేదీవరకు జిల్లా మహిళా ప్రాంగణంలో దరఖాస్తులను అందజేయాలని కోరారు.