ఖమ్మం, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీలలో భాగంగా హైదరాబాద్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్ దురిశెట్టి ఖమ్మం కలెక్టర్గా బదిలీ అయిన విషయం విదితమే.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్కు చేరుకున్న ఆయన తన చాంబర్లో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అనుదీప్ను.. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్షారైనా, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్లు, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.