బోనకల్లు (మధిర), ఏప్రిల్ 21: సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. దీంతో ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆరే అన్నదాతల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అన్నారు యాసంగి ధాన్యం కొనుగోలు కోసం మధిర మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం వివక్ష చూపిస్తున్నప్పటికీ రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఒకవైపు బీజేపీ నాయకులు, మరోవైపు కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిగట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆ పార్టీల స్వార్థ రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అనంతరం అక్కడే సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, మొండితోక లత, మెండెం లలిత, శీలం విద్యాలత, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, చావా వేణు, కోనా నరేందర్రెడ్డి, బొగ్గుల వీరారెడ్డి, ఎర్రగుంట రమేశ్, గద్దల రాజా, ఆళ్ల నాని, ఈవీ రెడ్డి, ఆవుల రామకృష్ణ, మహంకాళి శ్రీనివాసరావు, కొంగర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.