గిర్మాజీపేట, మార్చి 5: గంజాయి విక్రయిస్తున్న ఎక్సైజ్శాఖ ఉద్యోగిని మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతెజార్గంజ్ పోలీస్స్టేషన్ సీఐ ఎల్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహమ్మద్ జబ్బర్అలీ దుబారా ఖర్చులు చేసేవాడు. తాను పనిచేస్తున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో సీజ్ చేసి నిల్వ ఉన్న 1.090కిలోల ఎండుగంజాయిని దొంగిలించాడు.
దాన్ని వరంగల్ నగరానికి తన పల్సర్బైక్పై తీసుకొచ్చి బస్టాండ్ పరిసరాల్లో విక్రయించేందుకు సిద్ధపడగా పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు అతడి వద్ద 1.090 కిలోల ఎండు గంజాయి, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.