జయశంకర్ భూపాలపల్లి, మే 28 (నమస్తే తెలంగాణ): భూపాలపల్లి ఏరియాలో కంపెనీ క్వార్టర్లు లేక కార్మికులు పడిన ఇబ్బందులను చూసిన స్థాని క ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భూపాలపల్లి ఏరియాలో వె య్యి క్వార్టర్లను కొత్తగా నిర్మించాలని విజ్ఞప్తి చేశా రు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి సీ ఎండీ ఎన్.శ్రీధర్కు భూపాలపల్లి ఏరియాలో అధునాతన సౌకర్యాలతో వెయ్యి క్వార్టర్లను నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రూ.229 కోట్ల వ్యయంతో 994 డబుల్ బెడ్రూం క్వార్టర్లను యాజమాన్యం నిర్మించింది. ఈ డబుల్ బెడ్రూం క్వార్టర్ల సముదాయాని(రామప్ప కాలనీ)కి ఫిబ్రవరి 23న రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుంచి సింగరేణి అధికారులు పలు దఫాలుగా కార్మిక సంఘాలతో చ ర్చించి 1997 గైడ్లైన్స్ ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం భూపాలపల్లి ఎంవీటీసీ కార్యాలయంలో 994 క్వార్టర్స్తో పాటు ఖాళీ అయిన 98 ఇతర క్వార్టర్లను కలిపి 1,092 క్వార్టర్లకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు.
అర్హులైన కార్మికులకు కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇండ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం క్వార్టర్లు నిర్మించి ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భూపాలపల్లి ఏరియాలో క్వార్టర్ల కోసం 2,152 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన స్థానిక అధికారులు ఇందులో బెటర్మెంట్ కింద 514 మంది కార్మికులను, అసలే క్వార్టర్లు లేని 735 మంది కార్మికులను కౌన్సెలింగ్కు పిలిచింది. విపక్షాలు డబుల్ బెడ్రూం క్వార్టర్ల కేటాయింపుపై దుష్ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేక చొరవ చూపి క్వార్టర్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని భూపాలపల్లి ఏరియా జీఎం బళ్లారి శ్రీనివాసరావుకు సూచించారు. జీఎం శ్రీనివాసరావు కూడా పలుమార్లు కార్మిక సంఘాలతో చర్చించి ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా క్వార్టర్ల కేటాయింపులో ముఖ్య భూమిక పోషించారు.
సీఎం కేసీఆర్ వల్లే డబుల్ బెడ్రూం క్వార్టర్లు
నేను 1995లో సింగరేణి ఉద్యోగంలో చేరిన. 28 ఏండ్లుగా నాకు కంపెనీ క్వార్టర్ రాలేదు. సీఎం కేసీఆర్ వల్లే ఇక్కడ డబుల్ బెడ్రూం క్వార్టర్లు కట్టిన్రు. ఈ క్వార్టర్లు మంచిగున్నయ్. తెలంగాణ రాకపోతే నేను ఉద్యోగం నుంచి దిగిపోయే వరకు కూడా కంపెనీ క్వార్టర్ వచ్చేది కాదు. డబుల్ బెడ్రూం క్వార్టర్ ఆవరణ విశాలంగా ఉన్న ది. సీఎం కేసీఆర్ సారు వచ్చినంకనే మాకు మంచిగ జరుగుతున్నది. ఇన్నేండ్లకు కంపెనీ క్వార్టర్ వచ్చిందంటే నాతో పాటు మా కుటుంబమంతా సంతోషపడుతున్నరు.
–జీ భీమేశ్, సపోర్ట్మెన్, కేటీకే 5వ గని, భూపాలపల్లి
ఇరవై ఏండ్లుగా అద్దెకు ఉంటున్న..
నేను 2000 సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన. 2003లో భూపాలపల్లికి బదిలీపై వచ్చాను. అప్పటి నుం చి అద్దె ఇంట్లోనే ఉంటున్న. నాకు సొంతిల్లు లేదు. ఇ ప్పుడు డబుల్ బెడ్రూం క్వార్టర్ వచ్చిం ది. క్వార్టర్లు అన్ని వసతులతో కట్టించిన్రు. 20 ఏండ్లుగా కిరాయి ఇంట్లనే ఉంటున్న. బోర్ల నుంచి నీళ్లు సరిగ్గా వత్తలేవు. కేసీఆర్ సా రు వచ్చినంక ఒక క్వార్టర్లే కాదు, మా కార్మికులకు అన్ని మంచిగ చేస్తుండు. కార్మికులకు గతంలో పోయిన హక్కు లన్నీ కల్పించిండు. సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
–తోడేటి గోవర్ధన్, కోల్కట్టర్, కేటీకే 1వ గని, భూపాలపల్లి ఏరియా
సీఎం కేసీఆర్ చొరవ, ఎమ్మెల్యే కృషితోనే..
సీఎం కేసీఆర్ చొరవ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేక కృషి వల్లే భూపాలపల్లిలో డబుల్ బెడ్రూం క్వార్టర్లను సంస్థ నిర్మించిందని టీబీజీకేఎస్ భూపాలపల్లి ఏరియా బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అన్నారు. క్వార్టర్ల కౌన్సెలింగ్ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య క్వార్టర్ల ని ర్మాణంలో ముఖ్య భూమిక పోషించారని, వీరికి భూపాలపల్లి ఏరియా కార్మికుల పక్షా నప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు కూడా కార్మికులు టీబీజీకేఎస్ను ఇదే రీతిలో ఆదరించాలని కోరారు. ఆయన వెంట టీబీజీకేఎస్ నాయకులు తుమ్మేటి రఘోత్తంరెడ్డి, పోలుసాని జగత్రావు, రాజిరెడ్డి, కొచ్చర్ల రవికుమార్, సాంబయ్య, కుమార్, ప్రేమ్సింగ్, రాంచం దర్ తదితరులు పాల్గొన్నారు.