తల్లాడ: రైతులు విపరీతంగా పంటపొలాలకు పురుగుమందులు పిచికారీ చేయవద్దని హైదరాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్కుమార్, కృషివిజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హేమంత్కుమార్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బిల్లుపాడులో వరిపంటలను వారు పరిశీలించారు. రైతులను అడిగి పంటల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాక్టీరియా ఎండుతెగులు సోకిన పొలాల నివారణ చర్యలను గురించి వివరించారు. తెగులు సోకిన వరిదుబ్బులు పరిశీలించారు. పంటల్లో వచ్చే తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి ఎం.డీ.తాజుద్దీన్, ఏఈవోలు నాగుల్మీరా, ఏపీఎం భవ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడా నరసింహారావు, రైతులు పాల్గొన్నారు.