మామిళ్లగూడెం, ఫిబ్రవరి 13 : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న కేఆర్కే ప్రసాదరావును టీఎస్పీఏకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్లో టీఎస్పీఏ డైరెక్టర్గా పని చేస్తున్న కె.రవీందర్రెడ్డిని నియమిస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఎస్.సారంగపాణిని హైదరాబాద్ ఎస్బీ ఏసీపీగా బదిలీ చేశారు. సత్తుపల్లి ఏసీపీ రామానుజంను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఆయన స్థానంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీలో పని చేస్తున్న ఏ.రఘును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో 13 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కాగా.. బదిలీపై వచ్చిన ఎస్సైలకు జిల్లాలో పోస్టింగ్లు కేటాయించారు. కందగట్ల మధుబాబు ఎస్హెచ్వో బోనకల్, బెజ్జంకి లక్ష్మీభార్గవి ఎస్హెచ్వో మధిర రూరల్, నారబోయిన సంధ్య ఎస్హెచ్వో మధిర టౌన్, పర్సిక వెంకటేశ్ ఎస్హెచ్వో ఎర్రుపాలెం, షేక్ నాగుల్మీరా ఎస్హెచ్వో చింతకాని, ఏ.వంశీకృష్ణ భాగ్యరాజు ఎస్హెచ్వో వైరా, ఎండీ.ఉఫాతుల్ రఫీ సీఎస్బీ ఖమ్మం, బి.సాయికుమార్ వీఆర్ ఖమ్మం, ఎం.సురేశ్ ఖమ్మం, ఏ.రాజేందర్ వీఆర్ ఖమ్మం, ఈ.రాజేశ్ వీఆర్ ఖమ్మం, మేడా ప్రసాద్ వీఆర్ ఖమ్మం, నార్లాపురం రాజారాంకు కారేపల్లి ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన తహసీల్దార్లు, ఎంపీడీవోలకు కలెక్టర్ ప్రియాంక ఆల మంగళవారం పోస్టింగ్లు కేటాయించారు. గుండాల తహసీల్దార్గా ఇమ్మానియల్, పాల్వంచకు వివేక్, టేకులపల్లికి నాగభవాని, జూలూరుపాడుకు స్వాతి బిందు, ఆర్డీవో ఆఫీస్కు ఏవో అశోక్కుమార్, పినపాకకు సూర్యనారాయణ, కరకగూడేనికి నరేశ్, చండ్రుగొండకు జగదీశ్వర్, దమ్మపేటకు శ్రీనివాస్, చర్లకు ఎం.శ్రీనివాస్, కలెక్టరేట్కు తిరుమలాచారి, ఆళ్లపల్లికి శకుంతల, బూర్గంపాడుకు ముజాహిద్ను నియమించారు. చండ్రుగొండ ఎంపీడీవోగా అశోక్, మణుగూరుకు శ్రీనివాసరావు, పాల్వంచకు విజయభాస్కర్రెడ్డి, దమ్మపేటకు రవీందర్రెడ్డి, అన్నపురెడ్డిపల్లికి మహాలక్ష్మి, ఆళ్లపల్లికి రమాదేవి, చుంచుపల్లికి అశోక్కుమార్, బూర్గంపాడుకు జమలారెడ్డి, పినపాకకు రామకృష్ణ, దుమ్ముగూడేనికి చంద్రశేఖర్, జూలూరుపాడుకు కరుణాకర్రెడ్డి, టేకులపల్లికి రవీందర్రావు, లక్ష్మీదేవిపల్లికి చలపతిరావు, ములకలపల్లికి భారతి, ఇల్లెందుకు ధన్సింగ్, చర్ల మండలానికి ఈదయ్యకు పోస్టింగ్ ఇచ్చారు. బదిలీపై వచ్చిన వారు వెంటనే విధుల్లో చేరి రిపోర్ట్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 13 : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు బదిలీపై వచ్చిన ఎంపీడీవోలకు కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం స్థానాలు కేటాయించారు. ఏన్కూరు ఎంపీడీవోగా ఎస్.రమేశ్, సత్తుపల్లి డి.చంద్రశేఖర్, డి.అన్నపూర్ణ పెనుబల్లి, ఆర్.చిన్న నాగేశ్వరరావు కల్లూరు, ఎం.చంద్రమౌళి తల్లాడ, బి.సురేందర్ ఎర్రుపాలెం, వి.అశోక్కుమార్ రఘునాథపాలెం, శ్రీధర్స్వామి ముదిగొండ, జి.సురేందర్ సింగరేణి, జి.రవీందర్ కామేపల్లి, ఎస్.కుమార్ ఖమ్మం రూరల్, బి.వేణుగోపాల్రెడ్డి కూసుమంచి, పి.సరస్వతి వైరా, ఏ.రోజారాణి కొణిజర్ల, కె.శేషాద్రి తిరుమలాయపాలెం ఎంపీడీవోగా నియామకమయ్యారు. ఆర్.రామయ్య చింతకాని, ఎల్.రాజు బోనకల్, ఎం.ఎర్రయ్య నేలకొండపల్లి, బి.వెంకటేశ్వర్లు మధిర ఎంపీడీవోగా నియామకమయ్యారు. మండలాలు కేటాయించిన ఎంపీడీవోలు జాయినింగ్ రిపోర్టును జడ్పీ సీఈవోకు అందించారు.