సారపాక, సెప్టెంబర్ 20: తెలంగాణ సాధించిన కేసీఆర్ రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు మరోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి కూడా తెలంగాణలో బీఆర్ఎస్సే గెలుస్తుందని స్పష్టం చేశారు. సారపాక పట్టణంలోని కాంగ్రెస్కు చెందిన 60 కుటుంబాల వారు బుధవారం రాత్రి సారపాకలోని బీఆర్ఎస్ పట్టణ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ విప్ కాంతారావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని, అందుతున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ సహా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి శ్రీలత, బిక్కసాని శ్రీనివాసరావు, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, సానికొమ్ము శంకర్రెడ్డి, మేడిగం లక్ష్మీనారాయణరెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, పూర్ణ, బానోతు శ్రీను, గుల్మహ్మద్, బాలి శ్రీహరి, తుపాకుల రవి, బెజ్జంకి కనకాచారి, తిరుపతి ఏసోబు, ఆంజనేయులు, వారాల వేణు పాల్గొన్నారు.