చండ్రుగొండ, సెప్టెంబర్ 5: ప్రజలు మెచ్చిన నాయకుడు, పరిపాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నేడు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని వివరించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. చండ్రుగొండ మండలంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.1.50 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను, రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన సెర్ప్ వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రాన్ని ప్రారంభించారు. తొలుత బీఆర్ఎస్ నాయకులు మద్దుకూరు నుంచి 300 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. కోలాట నృత్యాలతో ఎదురేగి గజమాలతో సత్కరించారు.
తిప్పనపల్లి పంచాయతీలో కాంగ్రెస్ వార్డు సభ్యుడు బోడా వెంకటేశ్వర్లు (బుగ్గయ్య), బీసీ నాయకుడు వేల్పుల రాజయ్య, యువజన నాయకుడు పసుపులేటి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో 50 కుటుంబాల కాంగ్రెస్కు రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులయ్యే అనేక పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రేవతి, సాజియసుల్తానా, దారా వెంకటేశ్వరరావు (దారాబాబు), ఉప్పతల ఏడుకొండలు, మేడా మొహన్రావు, భూపతి రమేశ్, నల్లమోతు వెంకటనారాయణ, సయ్యద్ రసూల్, లంకా విజయలక్ష్మి, బానోత్ కుమారి, భూక్యా రాజీ, గాదె లింగయ్య, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబూరావు, బానోత్ రన్య, సత్తి నాగేశ్వరరావు, ఉన్నం నాగరాజు, భూపతి శ్రీనివాసరావు, మద్దిరాల చిన్నపిచ్చయ్య, కొదుమూరి జనార్దన్రావు, గుగులోత్ రమేష్, సుంకర రామారావు, చాపలమడుగు లక్ష్మణ్రావు, రామరాజు, బడికల శ్రావణ్కుమార్, అంచ కృష్ణ, కళ్లెం వెంకటేశ్వర్లు, బనోత్ బీలు తదితరులు పాల్గొన్నారు.