బోనకల్లు/ ముదిగొండ, సెప్టెంబర్ 26: మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రగతికి సోపానంగా నిలుస్తున్నాయని అన్నారు. బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామంలో కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన 50 కుటుంబాల వారు మంగళవారం రాత్రి జడ్పీ చైర్మన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కమల్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా మధిర నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. స్థానిక మల్లు భట్టివిక్రమార్క ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజవకర్గాన్ని వదిలివేసి తన స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కనీసం ప్రజలకు అందుబాటులో ఉండని ఘనుడు ఆయన అని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, వేమూ రి ప్రసాద్, వెంగళ కనకయ్య, గద్దల వెంకటేశ్వర్లు, గద్దల రవీందర్, షేక్ బీజాన్బీహుస్సేన్, దొప్పా కృష్ణ, పండుగ సీతారాములు, చల్దీ ప్రసాద్, బంధం నాగేశ్వరరావు, షేక్ రఫీ, షేక్ రుక్సానాబేగం, షేక్ జాన్మియా, పర్వతాచారి, షేక్ ఇబ్రహీం, షేక్ నజీర్, తమ్మారపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన నాలుగు కుటుంబాల వారు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఖమ్మంలోని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు చేరగా.. వారందరికీ జడ్పీ చైర్మన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాచేపల్లి లక్ష్మారెడ్డి, బండ్ల వాసు, పచ్చ సీతారామయ్య, బత్తుల వీరారెడ్డి, నెల్లూరి హన్మంతరావు, కోటి అనంతరాములు, వేముల శ్రీను, గుడిద మాధవరావు పాల్గొన్నారు.