వన భోజనంతో పుణ్యఫలం
అందరూ కలిసిమెలసి ఉండాలి..
వన మహోత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్
నగర పరిసరాల్లో ఉత్సాహంగా వేడుకలు
రఘునాథపాలెం, నవంబర్ 28 : కార్తీక మాసంలో పూజలు, వన భోజనాలతో పుణ్యఫలం దక్కుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని గొల్లగూడెం రోడ్డులో ఉన్న చెరుకూరి వారి రామకోటి తోటలో కమ్మ కుల వన సమారాధన, శ్రీనివాసనగర్ ఎస్వీఎం వారి మామిడితోటలో బ్రాహ్మణ వన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా మంత్రి అజయ్కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్మ కులస్తులు అన్నిరంగాల్లో ఆర్థికంగా ఉన్నవారే అధికంగా ఉన్నారని, అంతా ఐక్యమత్యంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఐక్యమత్యంగా ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చని అన్నారు. వనంలో ఏర్పాటు చేసిన శివలింగానికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. సూపర్ సింగర్స్ ఫేమ్ గాయకులు ఆలపించిన పాటలు ఉత్తేజం నింపాయి.
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, కమ్మ మహాజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్నేని రామారావు, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జవీన్కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురపు సంపత్, రాష్ట్ర కోశాధికారి కండెపునేని రత్నాకర్, ఖమ్మం జాయింట్ సెక్రటరీ మందడి నరేశ్చౌదరి, కోశాధికారి నల్లమోతు రఘు, ఈసీ సభ్యులు జట్ల శ్రీను, బండి మధుసూదన్రావు, ఊట్ల మురళి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలినేని నరేంద్ర, ఏలూరి శ్రీనివాసరావు, కర్నాటి వీరభద్రం, దుద్దుకూరి సత్యనారాయణ, చెరుకూరి రమేశ్, తాళ్లూరి సృజన్, దండ్యాల లక్ష్మణ్రావు, కొండబాల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ వన సమారాధనలో బ్రాహ్మణ సంఘం బాధ్యులు మాటూరి లక్ష్మీనారాయణ, సీతారామశాస్త్రి, రంగారావు, వాసు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మేయర్ పునకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.