ఎమ్మెల్సీగా తాతా మధును గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలి
వైరా ఎమ్మెల్యే రాములునాయక్
వైరా/ కారేపల్లి/ ఏన్కూరు, నవంబర్ 28 : రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ పార్టీదేనని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాతా మధు విజయాన్ని కాంక్షిస్తూ వైరా, కొణిజర్ల మండలంలోని ప్రజాప్రతినిధులు, వైరా మున్సిపల్ కౌన్సిలర్లతో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ర్టాభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు గెలుపు తథ్యమన్నారు. తాతా మధును గెలిపించుకొని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ పదవిని కానుకగా ఇవ్వాలని కోరారు. వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఎంపీపీలు వేల్పుల పావని, గోసు మధు, జడ్పీటీసీలు నంబూరి కనకదుర్గ, పోట్ల మాధవి, వైరా, కొణిజర్ల మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, వై.చిరంజీవి, వైరా పట్టణ అధ్యక్షుడు ధార్న రాజశేఖర్ పాల్గొన్నారు. కారేపల్లిలోని టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, సంత దేవాలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుగులోత్ శ్రీనునాయక్, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు పాండ్యానాయక్, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏన్కూరులోని టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ జిల్లాలో మూడోవంతు ఎంపీటీసీ, జడ్పీటీసీలు టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సురేశ్నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్యా లాలూనాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మేడా ధర్మారావు, ఎంపీటీసీలు చీరాల కృష్ణవేణి, శెట్టిపల్లి రాధమ్మ, రవిలాల్, నాయకులు చందులాల్, నరసింహారావు, నాగేశ్వరరావు, మజీద్ఖాన్, మైసారావు, బాజీ, శేషగిరిరావు, వెంకటేశ్వర్లు, శ్రీను, సత్యనారాయణ, శివకుమార్, నాగయ్య, గాలిబ్, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.