జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
బోనకల్లు, జూన్ 27: దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. వారి సంక్షేమం కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేని అన్నారు. టీఆర్ఎస్ మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, ముఖ్యకార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణను పలు రాష్ర్టాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. మధిర నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికీ ఏదోఒక రూపంలో లబ్ధి చేకూరిన విషయాన్ని గుర్తించిన ప్రజలు.. రెండోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేశారని అన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా కొత్తగా పింఛన్లు నిలిచిపోయాయని, త్వరలోనే వాటి మంజూరుకు శ్రీకారం చుడుతారని అన్నారు. అనంతరం రావినూతల, గోవిందాపురం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ బాణోతు కొండ, వైస్ చైర్మన్ జంగా రవికుమార్, సర్పంచ్లు కొమ్మినేని ఉపేందర్, జెర్రిపోతుల రవీందర్, చిలకా వెంకటేశ్వర్లు, చిరునోముల ఎంపీటీసీ కోటపర్తి హైమావతి, నాయకులు ఇటికాల శ్రీనివాసరావు, కొమ్మినేని సత్యనారాయణ, యార్లగడ్డ రాఘవ, కనకయ్య, శ్రీనివాసరావు, మురళి పాల్గొన్నారు.