
హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను సందర్శించిన ఖమ్మం జిల్లా రైతులు
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 25: ఆధునిక పద్ధతిలో ఉద్యాన పంటలను సాగు చేసేలా అవగాహన కోసం ఖమ్మం రైతులు హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ నర్సరీని సందర్శించారు. ఒక్కరోజు శిక్షణ నిమిత్తం ఖమ్మం నియోజకవర్గం ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ సందీప్కుమార్ ఆధ్వర్యంలో రఘునాథపాలెం, చింతకాని, కూసుమంచి, కొణిజర్ల మండలాలకు చెందిన 50 మంది రైతులు హైదరాబాద్ వెళ్లారు. పర్యటనలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో జరుగతున్న సాగు విధానం, సాగు పద్ధతులపై సందీప్కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం రిసోర్స్ పర్సన్ సుబ్బారావు కూరగాయల సాగులో బిందు సేద్యం ద్వారా ఎలా సాగు చేయాలో అవగాహన కల్పించినట్లు రైతులు తెలిపారు. పాలీహౌస్లో సాగు జరుగుతున్న పంటలను రైతులు పరిశీలించారు. పరిశోధన అధికారులు కమలాకర్ రెడ్డి, శృతి మొక్కల ఆరోగ్య కేంద్రం, భూసార పరీక్షలు, నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతం కావడంపై జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయ అధికారులు, రైతులకు అభినందనలు తెలిపారు.