వేతనాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..
స్థానిక’ ప్రజాప్రతినిధులకు నిధులు, విధులు పెంచుతాం
ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధును అధిక మెజార్టీతో గెలిపిద్దాం
సత్తుపల్లి సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా
తాతా మధును గెలిపించి కేసీఆర్కు కానుక ఇద్దాం: సండ్ర
సైనికుడిలా పనిచేస్తా.. ఆశీర్వదించండి: తాతా మధు
సత్తుపల్లి, నవంబర్ 24: స్థానిక సంస్థల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమైందని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న తాతా మధు విజయం కోసం ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులు, విధులు పెంచి వారికి ఉన్నతమైన గౌరవాన్ని కల్పిస్తామన్నారు. ప్రతినెలా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్ కృషిచేస్తున్నారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖమ్మం అభ్యర్థిగా తాతా మధును అధిష్ఠానం ప్రకటించిందని అన్నారు. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపాలని పిలుపునిచ్చారు.
గెలిపించి కానుక ఇద్దాం: సండ్ర
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇద్దామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తాతా మధుకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఆశీర్వదించండి: తాతా మధు
రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం సైనికుడిలా పనిచేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు అన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, డీసీసీబీ డైరెక్టర్లు చల్లగుళ్ల కృష్ణయ్య, గొర్ల సంజీవరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, రెడ్డెం వీరమోహనరెడ్డి, పాలెపు రామారావు, యాగంటి శ్రీనివాసరావు, కనగాల వెంకట్రావు, ఎంపీపీలు దొడ్డా హైమావతీ శంకర్రావు, బీరవల్లి రఘు, పగుట్ల వెంకటేశ్వరరావు, అలేఖ్య, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రఫీ, మల్లూరు అంకమరాజు, జడ్పీటీసీలు కూసంపూడి రామారావు, కట్టా అజయ్కుమార్, సుమలత, చెక్కిలాల మోహనరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సొసైటీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.