ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
బోనకల్లు, జనవరి 24: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులకు దన్నుగా నిలుస్తుందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మండలంలోని రావినూతల గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్న రోడ్డు నిర్మాణ పనుల విషయాన్ని సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్వయంగా వెళ్లి రోడ్డు నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం రావినూతల గ్రామానికి చెందిన ఎస్టీకాలనీలో దివ్యాంగులు, నిరుద్యోగులు వచ్చి తమకు ఉపాధి కల్పన కోసం రుణాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం గ్రామ యువకులు తమకు దళిత బంధు పథకం ద్వారా ఉపాధి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ దళితబంధు అమలవుతుందని, తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలోని వంద మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఫిబ్రవరి 4లోగా అర్హులను గుర్తించి నివేదికలు పంపించాలని అధికారులను కోరామన్నారు. అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆకాం క్షించారు. సర్పంచ్లు జెర్రిపోతుల రవీందర్, తేరబత్తిని శాంతయ్య, వేమూరి ప్రసాద్, బంధం శ్రీనివాసరావు, బానోత్ కొండా, మోదుగుల నాగేశ్వరరావు, ఇటికాల శ్రీనివాసరావు, యనిగండ్ల మురళి, తమ్మారపు బ్రహ్మయ్య, కరివేద సుధాకర్, చిలకా వెంకటేశ్వర్లు, బంధం తిరుపతిరావు, కాకాని శ్రీనివాసరావు, చావా హనుమంతరావు, యార్లగడ్డ రాఘవ తదితరులు పాల్గొన్నారు.