ఖమ్మం, జనవరి 24: టీఆర్ఎస్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పుట్టిన రోజు వేడుకలను ఖమ్మంలోని ఆయన నివాసంలో సోమవారం నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మంత్రి పువ్వాడ, గాయత్రి రవిని గజమాలతో సతరించారు. తలసేమియా రోగుల కోసం గాయత్రి రవి అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి అజయ్ ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన యువకులను మంత్రి అజయ్ అభినందించారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు గోళ్ల వెంకట్, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, శేషుకుమార్, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.