అసంఘటితరంగ కార్మికులకు అండగా ప్రభుత్వం
గణనీయంగా పరిహారం పెంపు
2021లో రూ.5 కోట్ల అందజేత
1,068 మందికి చేరిన సంక్షేమ ఫలాలు
కొత్తగూడెం అర్బన్, నవంబర్ 23 ;తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా అసంఘటితరంగ కార్మికుల కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టింది. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదానికి గురై మరణిస్తే బాధిత కుటుంబానికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను గణనీయంగా పెంచి ఆంక్షలు లేకుండా అందజేస్తున్నది. ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకుంటే కృత్రిమ అవయవాలు, వీల్చైర్లు, ట్రై సైకిళ్లను అందిస్తున్నది. ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.6 లక్షలు, దహన సంస్కార ఖర్చులకు రూ.30 వేలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.4 లక్షలను అందిస్తున్నది. తాత్కాలిక అంగవైకల్యం కలిగితే రూ.13,500, సహజ మరణానికి రూ.30 వేలను వారి కుటుంబ సభ్యుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్నది.
భవన నిర్మాణ కార్మికులు ప్రమాదానికి గురై మరణిస్తే బాధిత కుటుంబానికి ఇచ్చే ఎక్స్గ్రేషియా మొత్తాన్ని గణనీయంగా పెంచి ఆంక్షలు లేకుండా అందజేస్తున్నది. ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకుంటే కృత్రిమ అవయవాలు, వీల్చైర్లు, ట్రై సైకిళ్లను అందిస్తున్నది. ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.6 లక్షలు, దహన సంస్కార ఖర్చులకు రూ.30 వేలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.4 లక్షలను అందిస్తున్నది. తాత్కాలిక అంగవైకల్యం కలిగితే రూ.13,500, సహజ మరణానికి రూ.30 వేలను వారి కుటుంబ సభ్యుల ఖాతాలో ప్రభుత్వం వెంటనే జమ చేస్తున్నది.
2021లో రూ.5 కోట్ల అందజేత
2021 జనవరి నుంచి అక్టోబర్ వరకు 1,068 మంది లబ్ధిదారులకు సుమారు రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియాను నేరుగా వారికి ఖాతాకు ప్రభుత్వం జమ చేసింది. కార్మిక కుటుంబాల్లోని మహిళలకు ప్రసూతి సహాయం కింద ఇప్పటివరకు 377మందికి రూ.1.13 కోట్లు, సహజ మరణం పొందిన 109మంది కార్మిక కుటుంబాలకు రూ.1.14 కోట్లు, ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరి కుటుంబాలకు రూ.12.60 లక్షలు, మ్యారేజ్ బహుమతుల పథకం ద్వారా 380మందికి రూ.1.74 కోట్లను ప్రభుత్వం అందించింది. కరోనా మహమ్మారి వేళ వలస కార్మికుల పక్షాన నిలబడిన ప్రభుత్వం వారికి అన్నిరకాలుగా చేదోడువాదోడుగా ఉంటూ ఆదరించింది. ఆర్థికరంగం కుదేలైనప్పటికీ కార్మిక కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను సకాలంలో అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని గుర్తింపు పొందిన వారికే ప్రభుత్వం అందించే పథకాలు వర్తిస్తాయి. అసంఘటిత రంగం పరిధిలోకి వచ్చే భవన నిర్మాణరంగ కూలీలు, ఎలక్ట్రిషీయన్లు, ప్లంబర్లు, మేస్త్రీలు, రాడ్ బెండింగ్, పెయింటర్లు ఇతరత్రా కూలీలు దీనికి అర్హులుగా కార్మికశాఖ పేర్కొన్నది. నెలకు ఒక్క రూపాయి, సంవత్సరానికి రూ.12 చొప్పున ఐదు సంవత్సరాలకు రూ.60, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.50 మొత్తం రూ.110 చలానా తీసి, కార్మికశాఖలో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 77,440మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోగా వారిలో పురుషులు 45,316, స్త్రీలు 32,124 మంది ఉన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ గణనీయంగా పెంచారు. అయితే కార్మికులు తమ పేర్లను కార్మికశాఖలో నమోదు చేసుకుంటేనే ఫలాలు అందుతాయి. సీఎస్సీ లేదా మీసేవ సెంటర్లలో పేర్లను నమోదు చేసుకుంటే గుర్తింపుకార్డును మంజూరు చేస్తాం. గుర్తింపుకార్డు ప్రయోజనాలపై కూలీల అడ్డాల వద్ద విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం.