లక్షణాలున్నవారు వైద్యసిబ్బందికి తెలియజేయాలి
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి, జనవరి 23 : కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి జ్వరసర్వేలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పట్టణంలోని 23వ వార్డులో వైద్యసిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ జ్వరసర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వరసర్వేకు ప్రజలు సహకరించి అనారోగ్య లక్షణాలు, ఏవైనా అనుమానాలుంటే వైద్యసిబ్బందికి చెప్పి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మెడికల్ కిట్ను తీసుకుని వాడుకోవాలని సూచించారు. కరోనా వ్యాధి పెరగకుండా ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి స్వీయ రక్షణ పాటించాలని సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే రెండు కోట్ల మెడికల్ కిట్లను సిద్ధం చేసి ఇంటింటికీ సర్వే నిర్వహించి అనుమానితులకు వాటిని పంపిణీ చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా సర్వేలో భాగంగా 74 టీమ్లు పట్టణ, మండల వ్యాప్తంగా 3494 ఇళ్లను సర్వేచేసి 171 కిట్లను అందజేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు చింతా కిరణ్కుమార్, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ సుజాత, అమరవరపు కృష్ణారావు, చాంద్పాషా, అనిల్, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.