భద్రాచలం, ఫిబ్రవరి 20 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23, 24 తేదీల్లో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నందున స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య కల్యాణాలు నిలిపి వేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 22 సాయంత్రం సహస్ర కలశాభిషేకానికి అంకురార్పణ, 23న సహస్ర కలశవాహనం, 24న సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్య కల్యాణం 22న ఉంటుందని, 23, 24న నిలిపివేసి.. మళ్లీ 25న యథావిధిగా నిత్య కల్యాణం పునఃప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.