మామిళ్లగూడెం, నవంబర్ 22: బాధితులకు భరోసా కల్పించేలా విచారణ చేపట్టాలని, ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్య పరిషారానికి కృషి చేయాలని సీపీ విష్ణు యస్. వారియర్ సూచించారు. ప్రజా సమస్యల పరిషారం కోసం కమిషనరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాదివస్లో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి సీపీ వినతులు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల కారణాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫిర్యాదుల్లో అధికంగా భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతోపాటు ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్వోలకు సూచించారు.