సత్తుపల్లి, జూన్ 5 : లాక్డౌన్లో నిరుపేదలు ఎవరూ ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. చింతలపాటి వీధిలోని రేషన్ దుకాణంలో శనివారం ఆయన ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించి మాట్లాడారు. లాక్డౌన్ నేపథ్యంలో పలువురు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం వారికి చేయూత నిచ్చేందుకు కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 15 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చిరువ్యాపారులు, షాపులో పనిచేస్తున్న వ్యక్తులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ మీనన్, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు అద్దంకి అనిల్, చాంద్పాషా, మట్టా ప్రసాద్, సూరిబాబు, మేకల భవానీ, తడికమళ్ల ప్రకాశ్రావు, వీరపనేని బాబి తదితరులు పాల్గొన్నారు.
టీజీఎం సేవా సంస్థకు ఎమ్మెల్యే అభినందన
కల్లూరు, జూన్ 5: సీఎం కేసీఆర్ సారధ్యంలో కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం కల్లూరులోని ఏకలవ్య కాలనీ పెద్దకోరుకొండి గ్రామానికి చెందిన 35 నిరుపేద కుటుంబాలకు టీజీఎం(ట్రూత్ ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్) డైరెక్టర్ పి.యూనోస్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీకి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. టీజీఎం సంస్థ ద్వారా యూనోస్కుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందారన్నారు. కార్యక్రమంలో టీజీఎం సంస్థ సభ్యులు పాస్టర్లు సనత్ శామ్యూల్, సుందర్రాజు, రైతు బంధు సమితి మండల బాధ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణ్రావు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ.ఇస్మాయిల్, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, నాయకులు రాచమళ్ల నాగేశ్వరరావు, ఉబ్బన వెంకటరత్నం, కాటేపల్లి రజనీకాంత్, చారుగుండ్ల సందీప్, సీహెచ్.కిరణ్, ఖమ్మంపాటి రమేశ్, ఏనుమల రాంబాబు, కావటి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.