హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సంపదను పెంచాలి, పేదలకు, రైతులకు పంచాలి అన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆరేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి రోల్మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ప్రగతి ప్రభుత్వ మార్పిడితో వచ్చింది కాదని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వం, ప్రణాళికతోనే సాధ్యమైందని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి శాసనసభ బు ధవారం ధన్యవాదాలు తెలిపింది. ధన్యవాద తీర్మానంపై మండలిలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ సభ్యుడు భానుప్రసాదరావు ధన్యవాద తీ ర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చను ప్రాంభించారు. దీనిని మరో టీఆర్ఎస్ సభ్యుడు గంగాధర్గౌడ్ బలపర్చగా, చర్చలో ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ, టీఆర్ఎస్ సభ్యులు రాజేశ్వరరావు, తేరా చిన్నపరెడ్డి, పురాణం సతీశ్, గోరటి వెంకన్న, ఆకుల విజయ, యెగ్గె మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, బీజేపీ సభ్యుడు రామచందర్రావు, కాంగ్రెస్ సభ్యుడు టీ జీవన్రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు రఘోత్తమరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. సభ్యులు లేవనెత్తిన సందేహాలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సీఎం కేసీఆర్ తరఫున వివరణ ఇచ్చారు.