పోడు భూములు సాగు చేస్తూ, అటవీ హకుపత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ భూముల పరిరక్షణ, పోడు సమస్యల పరిషారానికి ప్రభుత్వం మంత్రి అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీని నియమించిందన్నారు. ఖమ్మం జిల్లాలో 1,57,531 ఎకరాల అటవీ ప్రాంతం(14.61 శాతం) ఉందని, ఐటీడీఏ, రెవెన్యూ, అటవీశాఖలు సమన్వయంతో సర్వే చేపట్టాలన్నారు. అటవీ, రెవెన్యూ భూముల సమస్యలు ఉంటే పరిషరించాలన్నారు. అటవీ సంరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అడవులు క్షీణించడం వల్ల మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందన్నారు. భవిష్యత్లో ఒక అంగుళం కూడా అటవీప్రాంతం అన్యాక్రాంతం కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, భట్టి విక్రమార్క, కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్, ఐటీడీపీ పీవో గౌతమ్ పాల్గొన్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో అడవుల సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత పరిషారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చాలాకాలంగా పోడు భూములను సాగుచేస్తూ అటవీ హకు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోడు భూముల సమస్య పరిషారంపై కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. అటవీ భూముల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణ, పోడు భూముల సమస్యల పరిషారం కోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. మంత్రి అధ్యక్షతన కలెక్టర్ కన్వీనర్గా, పోలీస్ కమిషనర్, ఐటీడీఏ పీవో, అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీశాఖ అధికారి, డీఆర్డీవో, డీబ్ల్యూవో సభ్యులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా సమన్వయ కమిటీని నియమించినట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లాలో 1,57,531 ఎకరాల అటవీ ప్రాంతం (14.61 శాతం) ఉందన్నారు. ఐటీడీఏ, రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయంతో సంయుక్త సర్వే చేపట్టి అటవీ, రెవెన్యూ భూముల సమస్యలు ఉంటే పరిషరించాలన్నారు. జిల్లాలో 10 మండలాల్లోని 94 పంచాయతీలు, 132 ఆవాసాల్లో పోడు భూముల సమస్య ఉందన్నారు. పోడు భూములపై హకుల కోసం జిల్లాలో 42,409 ఎకరాలకు సంబంధించి 18,295 దరఖాస్తులు వచ్చాయన్నారు. 2005కు ముందు నుంచి గిరిజనులు, మూడు తరాల (75 ఏళ్లు) నుంచి గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న భూముల క్లెయిములపై గ్రామస్థాయి కమిటీలో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని సూచించారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం ఎప్పటి నుంచి జరుగుతున్నదన్న వివరాలను శాటిలైట్ మ్యాపుల శాస్త్రీయంగా నిర్ధారించనున్నట్లు చెప్పారు. జీపీఎస్ సిస్టం ద్వారా డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని సూచించారు. అనంతరం అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందిస్తామని, తద్వారా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు వర్తిస్తాయని అన్నారు. అలాగే అటవీ భూముల ఆక్రమణ జరుగకుండా, అవి పునర్జీవం సాధించేలా అటవీ రక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సీపీ విష్ణు ఎస్ వారియర్, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ బోస్, డీఆర్డీవో విద్యాచందన, డీటీడబ్ల్యూవో కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ సర్వే చేపట్టాలి: ఎంపీ వద్దిరాజు
పోడు సమస్య పరిషారానికి జాయింట్ సర్వే పెట్టి చర్యలు తీసుకోవాలి. సేద్యమైన భూమికి ఒక హద్దు పెట్టాలి. ఆండ్రాయిడ్ ద్వారా ప్రక్రియ విజయవంతం చేయాలి.
అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయం ముఖ్యం: ఎంపీ నామా
పోడు సమస్యల పరిషారానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చర్చించుకొని సమస్యలు పరిషరించాలి. పోడు భూముల సమస్య పరిష్కారం విషయంలో జిల్లాకు మంచి పేరు తేవాలి.
అడవుల పరిరక్షణపై అవగాహన కల్పించాలి: ఎమ్మెల్సీ తాతా మధు
మంత్రి కేసీఆర్ ఒక మంచి విజన్తో పోడు భూముల సమస్య ముగింపునకు చర్యలు చేపట్టారు. అందుకు అనుగుణంగా అడవుల పరిరక్షణ, వాతావరణ సమతుల్యతపై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలి.
అటవీ భూములకు హద్దులు పెట్టాలి: ఎమ్మెల్యే సండ్ర
అటవీ భూములకు హద్దులు పెట్టాలి. పూర్వం భూములకు పట్టాలు ఉన్నప్పటికీ ఎల్ఆర్యూపీఎస్ సమయంలో అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని పరిషరించాలి. పోడు భూముల ప్రక్రియకు కాల పరిమితి పెట్టి ఆ సమయంలోగా పరిషరించాలి.
పరిష్కార చర్యలను వేగిరం చేయాలి: ఎమ్మెల్యే రాములునాయక్
పోడు భూముల సమస్య నా నియోజకవర్గంలో ఎకువగా ఉంది. ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. వచ్చే సీజన్ కల్లా సమస్య పరిషారం అయ్యేలా చర్యలు వేగవంగం చేయాలి.
ప్రభుత్వ మార్గదర్శకల మేరకు ప్రక్రియ: ఖమ్మం కలెక్టర్
2008 – 2022 కాలంలో ఆర్వోఎఫ్ఆర్ కింద 13,276 దరఖాస్తులను స్వీకరించాం. రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వేతో 6,143 దరఖాస్తులను ఆమోదించి 17,861 ఎకరాలకు పట్టాలు అందజేశాం. వీరికి రైతుబంధు సాయం కూడా అందుతోంది. ఈ దఫాలో 18,295 దరఖాస్తులు అందాయని, వీటిపై ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. క్షేత్ర సామగ్రిని సిద్ధం చేసుకొని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రక్రియను చేపడతాం.
ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే భట్టి
ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్దీ సమస్యలు అధికామవుతాయని, అందుకని త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రమేయం లేకుం డా దరఖాస్తులను పరిషరించాలి.