ఖమ్మం : శుక్రవారం జరిగే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్కు పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు తొమ్మిది మంది ఏసీపీల నేతృత్వంలో మొత్తం 1700 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో ఆరు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు. 14 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలు, 180 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 792 మంది కానిస్టేబుళ్లు, 136 మంది మహిళా కానిస్టేబుళ్లు, 349 హోంగార్డులు, 104 ఆర్మ్డ్ ఫోర్స్ పోలీసు సిబ్బందితో పాటు మూడు ప్లాటూన్ల టీఎస్ఎస్పీ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు పేర్కొన్నారు.