కల్లూరు, ఏప్రిల్ 13: సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మండలంలోని పేరువంచ గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు నేస్తమైన సీఎం కేసీఆర్ వారి సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతును రాజు చేయడం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఏడాది రైతులు పండించిన పంటలను సీఎం కేసీఆర్ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఇక్కడే తమ పంటను అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఎంపీపీ బీరవల్లి రఘు, సర్పంచ్ అంకిరెడ్డి అనూషరెడ్డి, వెంకటరెడ్డి, కొర్లగూడెం సొసైటీ చైర్మన్ కీసరి వెంకటేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాలెపు రామారావు, కొరకొప్పు ప్రసాద్, రావి సూర్యనారాయణ, నందిగం ప్రసాద్, తల్లపురెడ్డి పుల్లారెడ్డి, గుగులోతు ప్రసాద్, బొగ్గుల రామిరెడ్డి, రాజుబోయిన శ్రీనివాసరావు, అంకిరెడ్డి నాగిరెడ్డి, గుమ్మా వెంకటేశ్వరరావు, సామేలు, వెంకటేశ్వరరావు, రూప, అనూష, ఎస్సై రఫీ పాల్గొన్నారు.