ఆత్మీయతానురాగాలు, ప్రేమానుబంధాలు, సోదర భావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. అక్కలు తమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వారి నుంచి బహుమానాలు అందుకున్నారు.
ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు రేగా, వనమా, సండ్ర, మెచ్చా, హరిప్రియ, ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్రాజ్, ఖమ్మం కలెక్టర్ గౌతమ్, భద్రాద్రి ఎస్పీ వినీత్ జీకి వారి సోదరీమణులతోపాటు పలువురు మహిళలు రాఖీలు కట్టారు.
-నమస్తే నెట్వర్క్