ట్యాంక్బండ్పై తీగల బ్రిడ్జి నిర్మాణం
పర్యాటక గుమ్మమైన ఖమ్మం నగరం
లకారం అందాల మధ్య సస్పెన్షన్ బ్రిడ్జి
ఖమ్మం, నవంబర్ 10: ఖమ్మం జిల్లా టూరిజం హబ్గా మారుతోంది. ఇప్పటికే మెడికల్, గ్రానైట్, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీస్, ఐటీ విరాజిల్లుతున్న ఖమ్మం అతి త్వరలో టూరిజం స్పాట్గానూ అలరించేందుకు సిద్ధమవుతోంది. నగరంలోని లకారం ట్యాంక్బండ్పై నిర్మించిన తీగల వంతెనతో పర్యాటకుల చూపంతా ఖమ్మం వైపు మళ్లుతోంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించడంతో అక్కడ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న విషయం విదితమే. ఇకడ కూడా తీగల బ్రిడ్జి అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల పర్యాటకులంతా ఖమ్మం వైపు రానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక సోయగాలు అలరిస్తున్నాయి. దీనికి లకారం ట్యాంక్బండ్ అదనపు ఆకర్షణ కానుంది.
హైదరాబాద్లో హుస్సేన్సాగర్ వద్ద నిర్మించిన ట్యాంక్బండ్ మాదిరిగా ఖమ్మం లకారంపై ట్యాంక్బండ్ నిర్మించి పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు లకారంపై తీగల వంతెన కూడా నిర్మించడంతో టూరిస్టులంతా ఖమ్మం బాట పట్టనున్నారు. లకారం చెరువు మధ్యలో వేలాడే బ్రిడ్జిపై వెళ్తుంటే, ఆ బ్రిడ్జి ఉయ్యాల మాదిరిగా ఊగుతుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. సెలవు రోజుల్లో ఇప్పటికే ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఖమ్మం నగర రూపురేఖలను మార్చేందుకు మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలో బ్రిడ్జిమ్యాన్గా పేరుగాంచిన భరద్వాజ్తో డిజైన్ చేయించి రూ.8.50 కోట్ల వ్యయంతో ఈ కేబుల్ బ్రిడ్జిని ఇకడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ఢిల్లీకి చెందిన సంస్థ ఈ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది.
పాలేరు నుంచి పర్ణశాల దాకా..
పాలేరు, వైరా రిజర్వాయర్లతోపాటు పాల్వంచలోని కిన్నెరసాని అందాలు, భద్రాచలం లో గోదావరి సోయగాలు, శ్రీసీతారామచం ద్రస్వామి దేవాలయం, పర్ణశాల, పా ల్వంచలో పెద్దమ్మగుడి, జమలాపురంలో చిన్న తిరుపతి వేంకటేశ్వరఆలయం, గార్లవొడ్డులో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, కూసుమంచిలోని ప్రముఖ శివాలయం వం టివి ప్రస్తుతం పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. పాలేరు రిజర్వాయర్ ఐలాండ్లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పా టు చేసి ఆ ప్రాంతాన్ని కూడా టూరిస్టు స్పా ట్గా తీర్చిదిద్దాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
వెలుగు జిలుగుల ఖమ్మం నగరం..
ఖమ్మంలోని లకారం చెరువు, మినీ ట్యాంక్బండ్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తీగల వంతెన, మ్యూజికల్ ఫౌంటేన్ పూర్తవుతున్నాయి. ఇప్పటికే అర్బన్ పారెస్ట్ పారు, స్తంభాద్రి దేవాలయం, ఖమ్మం ఖిల్లా ఆకట్టుకుంటున్నా యి. నగరంలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్లు, డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన ఎల్ఈడీ విద్యుత్ కాంతులు నగరాన్ని వెలుగులతో నింపుతున్నాయి.